దేవరకొండ, నవంబర్ 22: రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అనారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని పెద్దతండాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు, దేవరకొండ పట్టణానికి చెందిన 40 కుటుంబాలు, చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మరో 20 కుటుంబాలు బీఆర్ఎస్లోకి చేరాయి. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రవీంద్రకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేతున్నారని తెలిపారు.
గత పాలకులు రైతులకు కరెంటు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని అన్నారు. మూడో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే రైతుబంధు రూ.16వేలకు పెంచుతున్నట్లు వారు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని చెప్పారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తుందని తెలిపారు. దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్నాయక్, నీల రవికుమార్, ఏర్పుల గోవింద్యాదవ్, రమావత్ రమేష్, ముత్యాల సర్వయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మెన్ ఉమేందర్నాయక్, సత్తయ్య, రమావత్ కిష్టు, శంకర్, అంకూరి ముత్యాలు, అంజనేయులు, సుగుణమ్మ, లతిత తదితరులున్నారు.