మాల్,నవంబర్ 6: మరోసారి ఆశీర్వదించి.. అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని గొడకొండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలన్నారు. తప్పుడు సమాచారం చేస్తున్న నాయకులను నమ్మకూడదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలు అమలుచేసిన ఘనత ఒక్క బీఆర్ఎస్ పార్టీదేనన్నారు.
ప్రజా సంక్షేమ పథకాలకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 24గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ను అందించి ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రాబోయే రాజుల్లో కేసీఆర్ బీమా ద్వారా లక్ష కుటుంబాలకు బీమా చేయబోతుందన్నారు. రైతు బంధును అడ్డుకునేలా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ మాటలను నమ్మకూదడని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ, ఆ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, గొపిడి కిష్టారెడ్డి, సాగర్రావు, నరేందర్ రావు, శ్రీదేవి శ్రీనివాస్తోపాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం కొండమల్లేపల్లి మండల యూత్ కాంగ్రెస అధ్యక్షుడు అభిషేక్ నాయక్తో పాటు 800మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ వరకు యువత బైక్ ర్యాలీగా వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బీల్యానాయక్, హన్మంత్ వెంకటేశ్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు రమావత్ దశ్రూనాయక్, జెడ్పీటీసీ సలహాదారులు పస్నూరి యుగేం ధర్రెడ్డి, మారుపాకుల సురేష్గౌడ్, సర్పంచ్ కుంభం శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీప మేకల శ్రీనివాస్యాదవ్, తులసీరాం ఉన్నారు.
పట్టణంలోని 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి చూసి ప్రజలలు పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు.