దేవరకొండ, నవంబర్ 15: అభివృద్ధిని చూసి మరోసారి ఆశ్వీదరించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించిన ఘటన సీఎం కేసీఆర్దే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పండుగలా మారిందని, ఇదంతా సీఎం కేసీఆర్ కృషి ఫలితమేనని చెప్పారు.
పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. గత పాలనలో ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకు వచ్చేవారని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నది ఒక్క తెలంగాణలో మాత్రమే అని చెప్పారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. దేవరకొండ ఖిల్లాలో రూ.5కోట్ల నిధులతో సుందరమైన పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల అంజనేయులు, ఇలియాస్, గాజుల రాజేశ్, వేములరాజు, తౌఫిక్ఖాద్రి, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు.
దేవరకొండరూరల్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని మర్రిచెట్టుతండా నుంచి 50 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు గుత్తా అమిత్ రెడ్డి, కిషన్నాయక్, వెంకటేష్గౌడ్, శ్రీనునాయక్, బావోజీ తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్: సీఎం కేసీఆర్ కృషితో తం డాలు ప్రగతి బాట పట్టాయని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని మైనంపల్లి, శకృతండా, మర్రిచెట్టు తండా, మడమడక, దుబ్బతండా, అమ్మటోని గూడెం, చింతబావి, తెలుగుపల్లి, మంగలోని బావి, తాటికోల్, వైదోనివంపు, కాచారం గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు స్థానికులు, గిరిజ నులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సం ద్భరంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తండా లను పంచాయతీలు చేయడంతో మరింత అభి వృద్ధి సాధ్యమైందని తెలిపారు. పదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు.
ఇలాంటి ప్రగతి నిరంతరం సాగాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే భవిష్యత్ అంధకారమేనని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న తనను ఆశీర్వదించి.. మరో సారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిల్యానాయక్, కిషన్నాయక్, వెంక టేష్గౌడ్, జెడ్పీటీసీ సలహాదారు మారుపాక సురే ష్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీ యన్రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, నేనా వత్ శ్రీనునాయక్, సర్పంచ్లు దీప్లా, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.