దేవరకొండ రూరల్, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కమలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పాలిటి దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి రైతుల కోసం ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నట్లు గుర్తుచేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, సర్పంచ్ రేపాని ఇద్దయ్య, కాశిరెడ్డి రవీందర్రెడ్డి, జైహింద్రెడ్డి, అనుపటి లక్ష్మయ్య, కడారి తిరుపతయ్య, సత్యనారయణగౌడ్, బొడ్డుపల్లి కృష్ణ, వెంకట్రెడ్డి, వార్డు సభ్యులు శ్రీను, సత్యనారాయణ, శోభన్, సైదులు, రాములు, రేపాని సత్యనారాయణ పాల్గొన్నారు.
నేరెడుగొమ్ము(చందంపేట) : మండలంలోని పేర్వాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. జడ్పీటీసీ కేతావత్ బాలు, పీఏసీఎస్ చైర్మన్ ముక్కామల బాలయ్య, వైస్ చైర్మన్ వీరారెడ్డి, సర్పంచ్ బషీర్, పల్స వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యుడు పాషా, బిక్కూనాయక్, లావుడ్యా రమేశ్, సాయన్న, కృష్ణ పాల్గొన్నారు.