భువనగిరి అర్బన్, నవంబర్ 27 : కాంగ్రెసోళ్లను నమ్మితే కటిక చీకట్లోకి తోసేస్తారని, వాల్లు చెప్పే హామీలన్నీ నీటి మీది బుడగలేనని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కిసాన్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కా్ంరగ్రెస్ నాయకలు వారంటీ లేని గ్యారెంటీలతో వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
కరెంట్పై పూటకో మాటమార్చే వాళ్లను నమ్మితే గోస పడుతారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో భువనగిరిలో జరిగిన అభివృద్ధి కళ్లముందే కన్పిస్తుందన్నారు. పార్కుల అభివృద్ధి, సీసీ రోడ్లు, కరెంట్ ఆఫీస్ రోడ్డు మార్గం వెడల్పు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. మరింత అభివృద్ధి జరుగాలంటే కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ భవానీగంగాధర్, నాయకులు పాల్గొన్నారు.