హాలియా, నవంబర్ 28: నియోజకవర్గాన్ని రెండున్నరేం డ్లలోనే అభివృద్ధి చేశానని, మళ్లీ ఆశీర్వదిస్తే… మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నా రు. ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయడం తో పాటు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి తోడ్పా టు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి , ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్ సహాకారంతో నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయల మేర నిధులను తీసుకొచ్చి అభివృద్ధికి పాటుపడ్డా.
నియజకవర్గంలో విద్య, వైద్యం, ప్రజా ఆరోగ్యం, తాగు, సాగునీరు, రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశా. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మళ్లీ గెలిపిస్తే వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ది పనులను పూర్తి చేయించడంతో పాటు మరో రూ. 300 కోట్లను తెచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, రోడ్ల విస్తరణ, నూతన చెక్డ్యాం లు, లిప్ట్లు, వంతెనల నిర్మాణం చేపడుతాం. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి, పలు అంశాలపై ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
డీ 8, 9 కెనాల్స్ కింద 7136 ఎకరాలకు సాగునీరు అందిం చేందుకు పెద్దవూర మండలం పూల్వతండా వద్ద రూ.2.5 కోట్ల తో వరద కాల్వపై ఏర్పాటు చేసిన లిప్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల ట్రయల్న్ కూడా చేశాం. ఎన్నికల అనంతరం డీ 8,9 కెనాల్స్కు లిప్ట్ ద్వారా సాగునీరు అందించాం. దీంతో 7136 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ను 50 ఏండ్లుగా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేయలేదు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం హాలియా, నందికొండను మున్సిపాలిటీ చేసింది. హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ఇప్పటికి 60 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టాం. అంతర్గత సీసీ రోడ్లును వేయడంతో పాటు హాలియా, నాగార్జున సాగర్లో మినీస్టేడియం, డిజిటల్ లైబ్రరి, ఆడిటోరియం, సాగర్లో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరించాం. హాలియాలో ఎడమ కాల్వ వెంట మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మళ్లీ ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ పనులను త్వరతిగతిన పూర్తి చేస్తా.
హాలియాలో బంజారా భవన్ ఏర్పాటు చేయాలన్నది గిరిజన నాయకులు చిరకాల కోరిక. 40 ఏండ్లుగా జానారెడ్డి గిరిజనులను ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారు. వారి అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో పాటు హాలియాలో గిరిజన భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 5కోట్ల రూపాయల విలువైన ఎకరం స్థలం కేటాయించింది. గిరిజన భవన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల రూపాయలను విడుదల చేయగా నేను మరో కోటి రూపాయలను ఇచ్చా. ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న ఎన్నికల అనంతరం మళ్లీ నేను ఎమ్మెల్యే అయ్యాక త్వరలోనే పనులు పూర్తి చేయిస్తా.
నాగార్జున సాగర్ ని యోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం తిరుమలగిరి సాగర్ ప్రాం తం. ఇక్కడ గిరిజనులు ఎక్కువ. జానారెడ్ది 35 ఏం డు ఎమ్మెల్యేగా, 16ఏండ్లు మంత్రిగా ఉన్నప్పటికి ఈ ప్రాం తాభివృద్ధికి పాటుపడలేదు. పరిపా లన సౌలభ్యం, గిరిజన అభివృద్ది కోసం ప్రభుత్వం తిరులగిరి కేంద్రంగా తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఏర్పాటుచేసింది. తిరుమలగిరి సాగర్ మండలానికి పీహెచ్సీతో పాటు జూనియర్ కళాశాల, అన్నిప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశా.
మన ఊరు మన బడి ప్రణాళిక కింద రూ.20 కోట్లతో నియోజకవ ర్గంలో 117పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపా యాలు కల్పించాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్లో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేని నాగార్జున సాగర్ నియోజకవ ర్గంలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకొచ్చా.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాగర్ కాలనీల్లో ఎన్ఎస్పీ క్వార్టర్స్ నిర్మించారు. 50 ఏండ్లుగా ఆ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వాళ్లు తమకే క్వార్టర్స్ కేటాయించాలని కోరారు.
జానారెడ్డి వారితో ఓట్లు వేయించుకున్నారే తప్ప వాళ్లకు క్వార్టర్స్ ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఎన్ఎస్పీ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వారికే ఎన్ఎస్పీ క్వార్టర్స్ కేటాయించారు. బుద్ధవనం నిర్మాణం పూర్తి చేశాం.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. నాగార్జునసాగర్లో 18 కోట్ల రూపాయలతో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాం. చిల్డ్రన్స్ కేర్ యూనిట్తో పాటు ఇటీవల డయాలసిస్ సెంటర్ను ఏర్పాటుచేశాం. అదేవిధంగా హాలియాలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో అదే విధంగా పోస్టుమార్టం సౌకర్యం కల్పించాం. నిడమనూరు, పెద్దవూర, త్రిపురారం మండలాల్లో పీహెచ్సీలకు నూతన భవనాల నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేయించాం.
గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లికల్లులిప్ట్ నిర్మాణం పేరుతో ఓట్లు వేయించుకున్నారే తప్ప లిప్ట్ నిర్మాణం చేపట్టలేదు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ నెల్లికల్లు లిప్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట 5000వేల ఎకరాలకు చేసిన నెల్లికల్లు లిప్ట్ డిజైన్ 24వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రీడీజైన్ చేయడంతో నిర్మాణం ఆలస్యమైంది. ప్రభుత్వం నెల్లికల్లు లిప్ట్ కోసం రూ. 680కోట్లను విడుదల చేసింది. ప్రస్తు తం నెల్లికల్లు లిప్ట్ నిర్మాణ పనులు యుద్దప్రాతిపాదికన సాగు తున్నాయి. వచ్చే ఏప్రిల్నాటికి నెల్లికల్లు లిప్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం. జూన్ నాటికి భూడు భూములకు సాగునీరు అందిస్తాం.