హాలియా, నవంబర్ 22: ప్రతిపక్ష నాయకులు ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హాలియా, అ నుముల, చిన్నఅనుముల, ఇబ్రహీంపేట గ్రామా ల్లో ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి జానారెడ్డి సొంతూరు అనుములలో ప్రజలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే భగత్కు విజయ తిలకం దిద్ది మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగర్ నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి పనిచేసే ప్రభుత్వానికి, నాయకుడికి అం డగా నిలవాలని కోరారు. హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకురావడంతో పాటు మినీ స్టేడియం, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, వెజ్అండ్ నాన్ వెజ్ మార్కెట్యార్డు పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ని గెలిపిస్తే రాష్ట్రంలో మూడో సారి కేసీఆర్ సీఎం అయి అభివృద్ధి చేస్తారని సూచించారు.
జానారెడ్డికి 7 సార్లు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పనిచేసి ఆయన చేసిందేమీ లేదని ఎమ్మెల్యే నోముల భగత్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అనుముల, చిన్న అనుముల గ్రామాల్లో ప్రజలను ద్దేశించి మాట్లాడారు. జానారెడ్డి 40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పనులను తనను రెండున్నరేండ్లలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో చేసినట్లు తెలిపారు. జడ్పీవైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, యడ వల్లి మహేందర్రెడ్డి, కౌన్సిలర్లు ప్రసాద్నాయక్, నల్లబోతు వెంకటయ్య, కోప్షన్ సభ్యులు రావుల లింగమ్మలింగయ్య, చాపల సైదులు, బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు వడ్డే సతీష్రెడ్డి, మార్కెట్ డైరేక్టర్లు పోశం శ్రీనివాస్గౌగౌడ్, సురబి రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు దోరేపల్లి వెంకన్న, సైదాచారి, దుర్గారావు, మాతం గి రమణ కాశమ్య, జింకల హారిప్రసాద్, పిల్లి వెంకట్, జూపల్లి కృష్ణ, అంజత్ఖాన్, లిం గాల సైదులు, వెంకటేశ్వర్లు, అయూబ్ఖాన్ ఉన్నారు.
నందికొండ: నియోజకవర్గంలోఎమ్మెల్యే భగత్కు మార్ చేసిన అభివృద్ధే బీఆర్ఎస్ గెలుపునకు సోపానాలు అని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో భగత్కు ఎవరితోనూ పోటీ లేదని తెలిపారు. రెండున్నరేండ్లలో నియోజకవర్గంలో ఎవరు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కండారి అం జయ్య, అబ్బిడి కృష్ణారెడ్డి, విజయేం దర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బిన్ని, మంగ్తానాయక్, మంగ్తా నాయక్, నిమ్మల ఇందిరాగౌడ్ ఉన్నారు.