నిడమనూరు, డిసెంబర్ 5 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, 17 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.5.58 లక్షల చెక్కులను సోమవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, తాసీల్దార్ ప్రమీల, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు చేకూరి హనుమంతరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవియాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, నాయకులు లకుమాల మధుబాబు, నల్లబోతు వెంకటేశ్వర్లు, సర్పంచులు కేశ శంకర్, జంగిలి రాములు, అర్వ స్వాతీఅశోక్, ఊరె రవి, సంకూరి ఆండాలు పాల్గొన్నారు.