త్రిపురారం, నవంబర్ 27: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న రైతు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయగూడెం, అంజనపల్లి, రాగడప, పలుగు తండా, లచ్చాతండా, కాపువారిగూడెం, కుంకుడుచెట్టు, రాగడప, మర్రిగూడెం, బెజ్జికల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రతి గ్రామంలో రైతులు, మహిళలు మంగళహారతులు, బోనాలు, డప్పు చప్పుళ్లతో పూలవర్షంతో ప్రచారానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతుల ప్రభుత్వమని అన్నారు. కౌలురైతు చట్టం తెచ్చి రైతుల మధ్య చిచ్చు పెడుదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, ప్రతి రైతు భూమి తన ఆధీనంలో ఉండేలా చేసిన ధరణిని తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా అని ప్రజలను ప్రశ్నించారు.
ఒక్కసారిగా ప్రజలంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ ఓటు అని చెప్పడంతో అంజనపల్లిలో కేరింతల నడుమ మూకుమ్మడిగా బీఆర్ఎస్కు ఓటు వేస్తామనడం ఆనందదాయకమన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ర్టాన్ని సుభిక్షంగా నడుపుతున్న కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలంతా ఈనెల 30న కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు.
సంక్షేమ పథకాలే
సంక్షేమ పథకాలే రాష్ట్రంలో బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోఎమ్మెల్యే భగత్తో కలిసి పాల్గొన్నారు. రైతు బాంధవుడిగా నిలిచిన సీఎం కేసీఆర్ వెంటే ప్రజలంతా ఉన్నారని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి భగత్కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఆయన ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. త్రిపురారంలో 11 కొత్త పంచాయతీలను ఏర్పా టుచేసి అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. గిరిజనులకు పోడు భూమి పట్టాలను అందించడమే కాకుండా వాటికి రైతుబంధు, రైతుబీమా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే భగత్ను ఆశీర్వదించాలన్నారు. కారు గుర్తుపై ఓటేసి భగత్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, మాజీ చైర్మన్ కామెర్ల జానయ్య, త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామారావు, శ్రీనివాస్యాదవ్, వెంకటాచారి, కలకొండ వెంకటేశ్వర్లు, మాద ధనలక్ష్మీవెంకటేశ్వర్లు, శ్యాంసుందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, వైస్ చైర్మన్ గుండెబోయిన్న వెంకన్నయాదవ్, గుండెబోయిన కోటేష్యాదవ్, సర్పంచ్లు శ్రీనివాస్, వెన్నల, బాజుమంగ్లానాయక్, రాత్ల నాగలక్ష్మి, రాందాసు, బాల్తి పద్మశ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు సైదులు, యూత్ అధ్యక్షుడు కాం తారావు, ఎంపీటీసీలు గజ్జల నారాయణమ్మధర్మారెడ్డి, రవినాయక్, సయ్యద్, దస్తగిరి పాల్గొన్నారు.
త్రిపురారం: మండలంలోని అంజనపల్లికి చెందిన సర్పంచ్ బుర్రి వెంకయ్యతో పాటు 20 కుటుం బాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాజీ నామా చేసి బీఆర్ఎస్లో చేరాయి. వారికి గులాబీ కండు వాలు కప్పి ఎమ్మెల్యే భగత్, ట్రైకార్ చైర్మన్ ఇస్లా వత్ రాంచందర్నాయక్ బీఆర్ఎస్లోకి ఆహ్వానిం చారు. పార్టీలో చేరిన వారిలో గుంజ లింగయ్య, హనుమయ్య, శివ, శేఖర్, నాగరాజు, శ్రీనివాస్, శంకర్, వంశీ, గణేష్, భార్గవ్, ప్రకాశ్, ప్రసాద్, నర్సింహా ఉన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ ఎస్లోకి చేరినట్లు వారు తెలిపారు.