కొండమల్లేపల్లి, జనవరి 22 : పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలూనాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేదవాడికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రభుత్వ దవాఖానను 100 పడకల స్థాయిని పెంచడానికి కృషి చేస్తానని అన్నారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా మెరుగైన సేవలు అందించాలన్నారు. విధుల పట్ల వైద్యులు అలసత్యం వహించారదనిఅన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు నల్లగాసు జాన్ యాదవ్, దూదిపాల రేఖా శ్రీధర్రెడ్డి, సిరందాసు కృష్ణయ్య, వెంకటయ్య, డీసీహెచ్ మాతృనాయక్, ఆసుపత్రి సూపరిటెండెంట్ రాములు నాయక్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.