మాల్, జనవరి 21: నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్లి మండలం తక్కెళ్లపల్లిలో నిర్మించిన అంగన్వాడీ భవనం, సీసీరోడ్డు, గొల్లపల్లి, రాయినిగూడెం, దేన్యాతండాతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలతో పాటు తీదేడులోని ఆరోగ్య సబ్ కేంద్రం, సీసీరోడ్లను ఆదివారం ఆయన ప్రారంభించి మా ట్లాడారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలు, పట్టణాలు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిలో మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో మహిళా, శిశుసంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ జిల్లా చైర్మన్ కంకణాల ప్రవీణా వెంకట్రెడ్డి, ఎంపీపీ కొండూరి భవానీ పవన్కుమార్, కంకణాల వెంకట్రెడ్డి, యాచారపు యాదగిరి, సర్పంచులు సత్తమ్మ, కాయితి జితేందర్రెడ్డి, ముచ్చర్ల యాదగిరి, రాజకొండ రుద్రమాదేవి ప్రసా ద్, శ్వేతా శ్రీశైలం గౌడ్, సంజీవరెడ్డి, హరినాయక్, శ్రీనివాస్ యాదవ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
చింతపల్లి మండలం ఎం.మల్లేపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ వైద్యుల వసంత ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఆదివారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట కేశగోని రవీందర్గౌడ్, ఎరుకుల వెంకటయ్యగౌడ్, హరినాయక్, గండు శ్రీనివాస్, మహ్మద్ సజీర్షఫీ, పర్వతాలు, అజార్, రాజుగౌడ్ ఉన్నారు.