చౌటుప్పల్ రూరల్ : ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని డి.నాగారంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆ గ్రామ బీజేపీ అధ్యక్షుడు కేశెట్టి మహేశ్ ఆయన సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ రాకుండా చేసి గుణపాఠం చెప్పాలని కోరారు. సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొత్త పర్వతాలు యాదవ్, మండల అధికార ప్రతినిధి సుర్కంటి శ్రీధర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సుర్కంటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.