మర్రిగూడ, నవంబర్ 6: రానున్న ఎన్నికల్లో అభివృద్ధ్ది నిరోధకులకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని ఎరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 25 కుటుంబాల నాయకులు సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో ఈసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాజగోపాల్ రెడ్డికి వ్యాపారాలు తప్ప ప్రజల క్షేమం పట్టని ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్,ఎంపీటీసీ గండికోట రాజమణిహరిక్రుష్ణ,బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్ గౌడ్, వల్లంల సంతోష్ యాదవ్, నాయకులు పుప్పాల యాదయ్య, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి, మెరుగు మురళి, వనపర్తి వెంకటయ్య, చింతకుంట్ల రాంరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని బడితండాకు చెందిన 10 బీజేపీ కుటుంబాలు వైస్ ఎంపీపీ ఆంగోతు రాజు నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో సర్పం చ్ జక్కర్తి పాపయ్య, రమేష్,రాజేష్ పాల్గొన్నారు.