మునుగోడు,నవంబర్ 1 : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఏక పక్షమే అని, మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మండల కేంద్రంలోని ఒకటో వార్డులోని ఎల్లమ్మగుడిలో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ గెలుపు బాటలు వేస్తాయని,బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, పందుల శ్రీను, మిర్యాల మధుకర్, పందుల నర్సింహ, పాలకూరి ఆశోక్,ఈద రాములు, దొమ్మాటి నరేశ్, రావిరాల కుమార్స్వామి, పందుల పాపయ్య, పందులింగస్వామి, వనం సురేశ్,దుబ్బ రవి, దుబ్బరాజు, పందుల రాజేశ్, పిల్లమర్రి వేణు, పెరుమాళ్ల ప్రణయ్కుమార్, ఏర్పుల స్వామి,నకిరేకంటి వెంకన్న పాల్గొన్నారు.
మునుగోడు మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్,మండలపార్టీ అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.
చౌటుప్పల్,నవంబర్ 1 : చౌటుప్పల్ పట్టణ అభివృద్ధి మరింత పరుగులు పెట్టాలంటే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని మరోసారి గెలిపించాలని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి అన్నారు.మున్సిపాలిటీపరిధిలోని 17వ వార్డులో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పస్తం గంగ రాములు, చింతల మహిపాల్ రెడ్డి, గుడూరు జైపాల్రెడ్డి, కలెట్ల నాగరాజు, భగవంత్రెడ్డి, హజీజ్, అబ్బాస్ పాల్గొన్నారు.
చౌటుప్పల్రూరల్ : మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థ్ధి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కారు గుర్తుకు వేటు వేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్గౌడ్ ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్రావు, ఉపసర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు మస్తాన్బాబు, రామలింగేశ్వర ఆలయ చైర్మన్ సత్యనారాయణగౌడ్, రైతు బంధు సమితి కమిటీ చైర్మన్ బోయిన లింగస్వామి, బీఆర్ఎస్ గ్రామశాఖ కార్యదర్శి మహకాళి పృథ్వీ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య కోరారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మండల కేంద్రంలో బుధవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.ఈ సందర్భంగా శివాలయంలో ఎమ్మెల్యే గెలువాలని బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ బిక్షం, నాయకులు జక్కిడి ధన్వంతరెడ్డి,పల్లె గోవర్ధన్ రెడ్డి, వీరమళ్ల వెంకటేశం,బొడ్డుపల్లి గాలయ్య, చిలువేరు ముత్యాలు, టరాసాల వెంకటేశం, బాకరాం వెంకటేశం, సూరపల్లి వెంకటేశం,చంద్రశేఖర్,రాచకొండ గిరి,చిలువేరు శంకర్, ఉష పాల్గొన్నారు.
చండూరు : మండలంలోని కస్తాల గ్రామంలో ప్రభాకర్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మరబోయిన వెంకటేశం, మెరుగు అంజయ్య, యువజన నాయకులు జాల వెంకటేశం, ఆకారపు శ్రీకాంత్, జాల చిట్టిబాబు, గాదపాక జంగయ్య, గంటెకంపు దేవేందర్, గంటెకంపు ప్రేమ్ కుమార్, ఆమలూరి అశోక్ , ఆకారపు గణేశ్, షేక్ జాహంగీర్, జినుకల సూరి, భూతం వెంకటేశం,దాసరి శ్రీకాంత్, గంటెకంపు సతీశ్, దాసరి సుధీర్, బొమ్మరబోయిన స్వామి, ఆకారపు వంశీ, దాసరి శ్రీను, ఖమ్మం పార్టీ రమేశ్ పాల్గొన్నారు.
గట్టుప్పల్: బీఆర్ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బుధవారం మండల కేంద్రంలోని 190వ బూత్లో, అంతంపేట గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నామని గోపాల్, సర్పంచ్ శేఖర్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, హనుమంతు, అబ్బయ్య, గణేశ్, చెరుపల్లి రమేశ్, కుండె కుమార్, వెంకటేశం పాల్గొన్నారు.
నాంపల్లి: మండలంలోని ఎస్ డబ్ల్యూ లింగోటం గ్రామంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతారవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పచ్చిపాల రామకృష్ణ, దుబ్బ జనార్దన్, నెర్మట శ్రీను, పగిళ్ల వెంకులు, వట్టికోట జంగయ్య, మీనయ్య, మారగోని గంగయ్య, దుబ్బ నరసమ్మ, ఊరెపాక మల్లమ్మ, దుబ్బ ముత్యాలు, దండిగ నర్సింహ పాల్గొన్నారు.
మర్రిగూడ :ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సూచన మేరకు బుధవారం మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని షురూ చేశారు.ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ అందుగుల ముత్యాలు,బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్,యూత్ నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్, వార్డు సభ్యులు సాల్గొన్నారు.