నీలగిరి, జూన్ 28 : సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో కంటి శుక్లాలు, క్యాటరాక్ట్ చికిత్సకు సంబంధించిన ఆధునాతన ఫ్యాకో మిషన్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం జనరల్ దవాఖానలో అనేక ఆధునాతన పరికారలతో ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.లచ్చునాయక్, ప్రిన్సిపల్ రాజకుమారి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు సమీయోద్దిన్, సందీప్, బోయనపల్లి శ్రీనివాస్, జెర్రిపోతుల భాస్కర్, అలకుంట్ల మోహన్బాబు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావు పాల్గొన్నారు.
సబ్సిడీ రుణాల పంపిణీ
నల్లగొండలో ముస్లింలకు సంబంధించి 78 మందికి రూ.2 లక్షల సబ్సిడీ రుణాలను ఎమ్మెల్యే భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి బాలకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, కౌన్సిలర్లు ఖయ్యుంబేగ్, ఇబ్రహీం, సమీయోద్దిన్, వట్టిపల్లి శ్రీనివాస్, జమాల్ఖాద్రి, నిరంజన్ వలీ, అహ్మద్ కలీం, దేప వెంకట్రెడ్డి, బకరం వెంకన్న, పెరిక ఉమామహేశ్వర్, పెరిక యాదయ్య పాల్గొన్నారు.
అన్ని విధాలా అండగా ఉంటాం..
నల్లగొండ పట్టణంలో సోమవారం ఏసీ గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిన కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. తక్షణ సాయంగా రెండు కుటుంబాలకు చేరొక రూ. 50వేల చొప్పున నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పించేందుకు మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్తో సంప్రదించి వివరాలు పంపించినట్లు చెప్పారు. పిల్లల చదువుల కోసం సహకరిస్తానని చెరో డబుల్ బెడ్రూం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఇబ్రహీం, జమాల్ఖాద్రీ, సమీయోద్దిన్, వట్టిపల్లి శ్రీనివాస్, వీరమల్ల భాస్కర్, హసన్ సలీం ఉన్నారు.