రామగిరి, నవంబర్ 26 : ప్రైవేట్ విద్యా సంస్థల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని ఆ విద్యా సంస్థల ఐక్యవేదిక నిర్వాహకులు స్పష్టం చేశారు. నల్లగొండ ఎన్ఆర్ఎస్ గార్డెన్స్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయులను కరోనా కష్టకాలంతో ఆదుకున్నది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. వారికి రూ.2వేలు, ఉచిత బియ్యం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే అర్హులైన ఉపాధ్యాయులు, సిబ్బందికి రాబోయే కాలంలో ఆరోగ్య శ్రీహెల్త్కార్డులు, రేషన్ కార్డులు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూం అందించేలా కృషి చేస్తామన్నారు. ప్రైవేటే విద్యా సంస్థలు తనకు మద్దతు తెలుపడంతో సిబ్బంది, యజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య విద్యా సంస్థ్ధల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్కే పట్టం కట్టాలన్నారు. నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఓటు వేసి అధిక మెజార్టితో గెలిపిద్దామన్నారు. అనంతరం భూపాల్రెడ్డికి మద్దతు ఇస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ట్రస్మా రాష్ట్ర నేత, ఐక్య విద్యా సంస్థల నేత యా నాల ప్రభాకర్రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యదర్శి తలకోల పురుషోత్తం రెడ్డి, కేజీ టూ పీజీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాల యజమాన్యాల వ్యవహర్తలు, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు సామాల వెం కటేశ్వర్లు, చందా శ్రీను, జీవీ రావు, ఎండీ అజీజ్, సునీల్కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అలీ, బక్క నర్సింహ, లీగల్ సెల్ సలహాదారులు కె.జవర్లాల్, టీపీటీఎఫ్ ప్రతినిధులు ముదుమూర్తి, సంజీవరెడ్డి ఉపాధ్యాయులు హాజరయ్యారు.