నీలగిరి, నవంబర్ 9 : ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండ ఇప్పుడిప్పుడే అభివృద్ధ్ది బాటలో పయనిస్తున్నదని, నల్లగొండ పునర్నిర్మాణానికి ప్రజలంతా ఆలోచన చేసి మళ్లీ దీవించి, తనను మరోసారి అసెంబ్లీకి పంపించాలని బీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.
గత ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మొదటి సంవత్సరం స్థ్ధానిక ఎన్నికలు, మరో రెండేండ్లు కరోనాతో ఇబ్బంది పడ్డామని, తరువాత రెండేండ్లలోనే నల్లగొండ లో 1,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ను అధికారంలోకి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
కాంగ్రెస్కు అధికారం ఇస్తే పేదోడి కడుపు నిం పడం కాదు స్కామ్ల చేస్తూ వారి కడుపులు నింపుకుంటారని ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి ఐటీ హబ్, మెడికల్ కళాశాల, బత్తాయి మార్కెట్ తెస్తానని ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. మాయ మాటలు చెబుతున్న నల్లగొండ ప్రజలు కోమటిరెడ్డిని ఐదేండ్ల క్రితం ఓడించి తరిమిస్తే భువనగిరికి పారిపోయి మళ్లీ డబ్బు సంచులతో వచ్చాడని అన్నారు. నల్లగొండ ఇండ్లు, ఖాళీ జాగాలు కబ్జాలకు గురికాకుండా ఉండాలంటే ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటూ, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. అమరవీరుల ఆత్మార్పణం జరిగిందే కాంగ్రెస్ పాలనలో అని ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్దేనని విరుచుకుపడ్డారు.
ఈనెల 20న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండడంతో నల్లగొండ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థ్దిగా కంచర్ల భూపాల్రెడ్డి సాదాసీదాగా తన రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం స్వగ్రా మం ఉరుమడ్ల రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 9.20 నిమిషాలకు కుటుంబసభ్యులు, సోదరీమణులు మంగళహారతులు పట్టి విజయతిలకం దిద్దగా తల్లి కౌసల్య, సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఆశీర్వాదాలు తీసుకున్నారు. భూపాల్రెడ్డి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వెంటరాగా వీటీ కాలనీలోని వేంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో అభిషేకం చేసి ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్లు దాఖ లు చేశారు.
అంతకుముందు మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని వేద పండితులు నిర్వహించిన ముహూ ర్తం ప్రకారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, నాయకులు నిరంజన్వలీ, కంచర్ల కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంజీయూ పాలక మండలి సభ్యుడు బోయినపల్లి కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, తీగల జాన్శాస్త్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహ్మద్ కలీం, మాలె శరణ్యారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్,
బొర్రా సుధాకర్, బక్క పిచ్చయ్య, మామిడి పద్మ, సింగం రామ్మోహన్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, ఫరీదుద్దీన్, మైనం శ్రీను, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, మారగోని భవానీగణేశ్, అలకుంట్ల రాజేశ్వరి, మోహన్బాబు, కొండూరు సత్యనారాయణ, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, వైస్ ఎంపీపీలు జిల్లపల్లి పరమేశ్, ఏనుగు వెంకట్రెడ్డి, రామగిరి శ్రీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నంరాజు, వంగాల సహదేవ్రెడ్డి, దోటి శ్రీనివాస్, కందుల రేణుక, తవిటి కృష్ణ, సందినేని జనార్దన్, రావుల శ్రీనివాస్రెడ్డి, నేతి రఘుపతి, జమాల్ఖాద్రీ, శేఖర్ పాల్గొన్నారు.