సూర్యాపేట, మే 27 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి టాప్ ప్లేస్లో ఉన్నారని, పట్టభద్రులు మూకుమ్మడిగా ఆయనకే ఓటు వేసి పట్టం కట్టబోతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 457వ పోలింగ్ బూత్లో 673 మంది ఓటర్లు ఉండగా ఉదయం ఎనిమిది గంటలకే ఆయన మొదటి ఓటును వినియోగించుకొని యువతకు ఆదర్శంగా నిలిచారు.
అనంతరం మీడియాతో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కొద్ది రోజులుగా జరిగిన ప్రచారాల్లో పట్టభద్రులైన ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని తెలిపారు. బ్లాక్ మె యిలింగ్కు పాల్పడే కాంగ్రెస్ అభ్యర్థిని, ప్రజల్లో కనిపించని బీజేపీ అభ్యర్థిని కాదనుకున్నారని చెప్పారు. ఉన్నత చదువులు చదివి సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన రాకేశ్రెడ్డిని గెలిపించుకునేందుకు పట్టభద్రులైన యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పింఛన్దారులు పెద్దఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చారని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, ఓటు వేయకపోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమేనని అన్నారు.