తిరుమలగిరి, నవంబర్ 30 : తుంగతుర్తి నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు మద్దకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల తర్వాత ఊపందుకున్నది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. యువత పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నది.
ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ దంపతులు మాలిపురం పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 2,55,017. పోలైన ఓట్లు 2,23,163. పురుషులు 1,13,229. స్త్రీలు 1,09,932. ఇతరులు 02. పోలింగ్ శాతం 87.51గా నమోదైంది. 2018లో 86.3 శాతం పోలింగ్ నమోదైంది.