తిరుమలగిరి, అక్టోబర్ 21 : అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని అన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
శాలిగౌరారం : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బైరవునిబండ గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన 5 కుటుంబాలు ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారంతా కొత్త, పాత తేడా లేకుండా కలిసికట్టుగా పని చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, ఎంపీటీసీ కొత్త శంకర్రెడ్డి, బైరవునిబండ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈదులకంటి యాదయ్య, దండ నర్సిరెడ్డి, రవీందర్రెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.