తుంగతుర్తి, నవంబర్ 1 : గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తుంగతుర్తి నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో రూ.3 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని తూర్పుగూడెం, గానుగుబండ, కొత్తగూడెం, కర్విరాల, రామన్నగూడెం, సూర్యతండా, మంచితండా, బండరామారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నియోజక వర్గంలో 50 వేల మందికి ఆసరా పింఛన్లు, 11 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేసినట్లు తెలిపారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే తెల్లరేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు ప్రజలు నమ్మవద్దని, నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, బీఆర్ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్ల్లపల్లి శోభన్బాబు, మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లు రామ్చంద్రారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, పూలమ్మ, ప్రణీతరెడ్డి, కేతిరెడ్డి లతారెడ్డి, చెరుకు పరమేశ్, తడకమళ్ల రవికుమార్, గోపగాని రమేశ్గౌడ్, పూర్ణనాయక్, విజ్జినాయక్ పాల్గొన్నారు.