నాగారం, నవంబర్ 6 : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో నీళ్లు లేక పంట పొలాలు బీడు భూములుగా మారాయని.. నేడు బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి పచ్చని మాగానంలా మార్చామని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం నాగారం మండలంలోని పసునూరు, పస్తాల, లక్ష్మాపురం, శాంతినగర్, నాగారం, వర్దమానుకోట, మాచిరెడ్డిపల్లి, ఈటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు నియోజకవర్గంలో ఏ పండుగ చేయాలన్నా ప్రజలు భయపడే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం జలాలతో నియోజకవర్గ రైతులకు కాళ్లను కడిగామన్నారు.
తెల్లరేషన్ కార్డు దారులకు కేసీఆర్ బీమా, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, గృహలక్ష్మి, బీసీ బంధు దశల వారీగా అందజేయనున్నట్లు తెలిపారు. తిరిగి అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో 15వేల కుటుంబాలకు దళిత బంధు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తాగునీటికి ప్రతి గ్రామంలో గోస పడేవారని, మిషన్ భగీరథతో ఆ కష్టం తీరిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 49,399 ఆసరా పింఛన్లు, 11వేల మందికి కల్యాణలక్ష్మి, 8,745 కేసీఆర్ కిట్లు, 2,700 కుటుంబాలకు దళిత బంధు, బీఆర్ఎస మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలను వివరించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ రామలక్ష్మణులని, నాగారాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
మరోమారు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కూరం మణీవెంకన్న, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, తిరుమలగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండగాని అంబయ్యగౌడ్, జిల్లా సభ్యులు పొదిల రమేశ్, నాయకులు ఎర్ర యాదగిరి, కడియం పరమేశ్వర్, ఈదుల కిరణ్కుమార్, దోమల బాలమల్లు, చిల్లర చంద్రమౌళి, సోమయ్య, అంజయ్య, వెంకన్న, శ్రీనివాస్, యాదగిరి, మహేందర్, అంజయ్య, అశోక్, లింగమల్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేనులు పాల్గొన్నారు.
మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు షేక్ షైన్బీతో పాటు 20మంది ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో షేక్ సయ్యద్, జానీమియా, బుడ్డా, సైదులు, లింగయ్య, బడేసాబ్, జాను, రాములు, జానయ్య, రమేశ్, యాకయ్య ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, నాయకులు పాల్గొన్నారు.