తుంగతుర్తి, నవంబర్ 9 : తెలంగాణ సాయుధ పోరాటాల పురిటిగడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం మండల కేంద్రంలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించి ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తున్నదన్నారు. గత పాలకుల పాలనలో నియోజక వర్గం ఏ మాత్రం అభివృద్ధి జరుగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సకల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.
మరింత అభివృద్ధికి ముచ్చటగా మూడోసారి ఓటు వేసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. సామాన్యుడి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగేంధర్రావు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్యతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.