అడ్డగూడూరు, నవంబర్ 13 : రైతులు కాంగ్రెస్ చెబుతున్న 3 గంటల విద్యుత్ వైపు ఉంటారా.. లేక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉచితంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని డి.రేపాక, కంచనపల్లి, బొడ్డుగూడెం, చిర్రగూడూరు, కోటమర్తి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు త్వరలో బస్వాపురం ప్రాజెక్ట్ గుండా కాళేశ్వరం జలాలు రానున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 6 మండలాలకు కాళేశ్వరం జాలాలతో దాదాపు 95 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. రూ.50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్రెడ్డి అని విమర్శించారు. తుంగతుర్తి నియోజక వర్గంలో 50 వేల మందికి ఆసరా ఫించన్లు, 95 వేల మందికి రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందుతున్నట్లు వివరించారు. ఎన్నికల తర్వాత తెల్లరేషన్ కార్డు దారులకు కేసీఆర్ బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందివ్వడంతో పాటు గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధును దశల వారీగా అర్హులైన వారికి అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల పోలింగ్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మోజార్టీతో తనను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు : కంచర్ల రామకృష్ణారెడ్డి
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయిల్ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు కొత్తగా వాళ్లు ఏమి చేస్తారన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఆ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు దొరకక బీఆర్ఎస్ నుంచి తీసుకుని, పార్టీ సభ్యత్వం లేని వారికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నట్లు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి రేటేంతరెడ్డిగా మారడని దుయ్యబట్టారు. 10 హెచ్పీ మోటార్లు రైతులు ఉపయోగించరని వ్యవసాయం మీద కనీస అవగాహన లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నట్లు విమర్శించారు. కంచనపల్లి గ్రామానికి చెందిన రైతు హన్మకొండ ఆనందాచారి రైతు బంధు ద్వారా వచ్చిన డబ్బులు రూ.50 వేలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు ఎన్నికల ఖర్చు కోసం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి హేంద్రనాథ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, నాయకులు కంచర్ల చలపతిరెడ్డి, కన్న వీరస్వామి, చిత్తలూరి నరేశ్, వెంపల్ల నర్సిరెడ్డి, కుకునూరు వెంకట్రెడ్డి, ఎల్లంల వీరాస్వామి, కమ్మంపాటి పరమేశ్, పాశం విష్ణువర్ధన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను ఆశీర్వదించండి ;ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
మోత్కూరు : అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. అడ్డగూడూరు మండల ఎన్నికల ప్రచారంలో మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కండ్ల ముందు కనిపిస్తున్న తుంగతుర్తి నియోజక వర్గ అభివృద్ధిని చూసి పార్టీలకతీతంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. పురుగుల అజయ్, పంగ నర్సింహ, ఆరే పవన్, అన్నెబోయిన దుర్గాప్రసాద్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు జంగ శ్రీను, శాఖ గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి, సింగిల్ విండో డైరెక్టర్ పురుగుల మల్లయ్య, నాయకులు జంగ నర్సయ్య, పురుగుల పెద్ద మల్లయ్య, ఇక్కిరి నాగరాజు పాల్గొన్నారు.