నల్లగొండ : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్ పల్లి మండలంలోని కోటి రూపాయలతో నిర్మించనున్న చిప్పలపల్లి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన , నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం వెనుకబడటానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు.
అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. అనంతరం రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న PWD రోడ్ నుంచి బాజకుంట బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, అక్కెనపల్లి గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, స్ధానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.