నార్కట్పల్లి, మే 12 : బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్కు పుష్పగుచ్ఛాన్ని అందించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పురోగతిపై సీఎం వాకబు చేస్తూ ఎమ్మెల్యే కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా అవసరమైన నిధులపై అరా తీస్తూ మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి వెల్లడించారు. వచ్చే నెల చివరి వారం వరకు ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం చేస్తామని, ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ను ఆహ్వానించామని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.