నకిరేకల్, నవంబర్ 26 : తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని, సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులతో పాటు మండలంలోని గోరెంకలపల్లి, మంగళపల్లి, తాటికల్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, 30న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
చిరుమర్తి లింగ య్య మాట్లాడుతూ తనను మూడోసారి గెలిపిస్తే ఇక్కడి ప్రజల మధ్యే ఉంటానని, ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, చింతల సోమన్న, నలగాటి ప్రసన్నరాజ్, సందినేని వెంకటేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొర్ల సరిత వీరయ్య,
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మంగళపల్లి సర్పంచి ప్రగడపు నవీన్రావు, మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు తక్కెళ్లపల్లి ప్రభాకర్రావు, సోమ యాదగిరి, గోరెంకలపల్లి సర్పంచి చెట్టిపల్లి జానయ్య, గ్రామశాఖ అధ్యక్షులు చెనగాని జానయ్య, ముచ్చపోతుల నాగయ్య పాల్గొన్నారు.
నార్కట్పల్లి, నవంబర్ 26 : రాష్ట్ర అభివృద్ధే బీఆర్ఎస్ ఏజెండా అని, మూడోసారి సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని నక్కలపల్లి గ్రామంలో ఆదివారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ముందుగా ఇద్దరిని సన్మానించారు. డప్పు చప్పుళ్లతో కోలాటాల నడుమ ఇంటింటికి ఓటును అభ్యర్థ్దించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహర్నిశలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని నియోజకవర్గ అభివృద్ధ్ది కోసమే పార్టీ మారానని స్పష్టం చేశారు.
ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ చొరవతోనే పూర్తి చేశానన్నారు. కారు గుర్తుపై ఓటేసి తనకు మరో అవకాశం కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ ఈద మాధవి నర్సింహ, ఎంపీటీసీ కనుకు అంజ య్య, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.