కట్టంగూర్, నవంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. కట్టంగూర్, పిట్టంపల్లి గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన 70 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం కట్టంగూర్లో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాన్ని ప్రశ్నిస్తే టీఆర్ఎస్ నాయకులు, మంత్రులపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నదని, ఆ దాడులకు ఎవరూ భయపడరన్నారు. యావత్ దేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని, దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుందని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు పనస సైదులు, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, ఎంపీటీసీలు పాలడుగు హరికృష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్, కట్టంగూర్ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బొల్లెద్దు యాదయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు జనార్దన్ పాల్గొన్నారు.
నకిరేకల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై కార్యకర్తలు పార్టీ లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 16వ వార్డులోని వివిధ పార్టీలకు చెందిన 30మంది కార్యకర్తలు కౌన్సిలర్ గర్షకోటి సైదులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పార్టీలో చేరిన యువత క్రమశిక్షణతో ఉండి ముందుకు నడవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు గుర్రం గణేశ్, సదానందం, కార్యకర్తలు పాల్గొన్నారు.