నార్కట్పల్లి, నవంబర్ 15 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని జడ్పీనకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దాసరిగూడెం, చెర్వుగట్టు, ఏపీ లింగోటం గ్రామాల్లో బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతీ ఇంటికి సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వాదేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మితే మోసపోతామన్నారు. మీ ప్రాంతం వాడిని కాబట్టి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మరో మూడు నెలల్లో నార్కట్పల్లి సుందరంగా తయారవుతుందన్నారు.
చిరుమర్తికి జన నీరాజనం బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థ్ది చిరుమర్తి లింగయ్య ప్రచార యాత్రకు మండలంలోని గ్రామాల ప్రజలు జన నీరాజనం పలికారు. మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి హారతులతో స్వాగ తం పలికారు. గ్రామాల్లో కోలాటాలు నృత్యాలతో పటాకులు కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూర్ శంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, సర్పంచ్ బాలకృష్ణ, ప్రజాప్రతినిధులు , బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కేతేపల్లి : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటువేస్తే ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కొత్తపేట, చెర్కుపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయమని ఓటర్లను ఆయన కోరారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం రైతులు రాత్రిపూట లాంథర్లు పట్టుకొని తిరిగేవారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో నేడు రైతుల కరెంటు కష్టాలు తీరాయని తెలిపారు. మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత రూ.400 కు సిలిండర్, సౌభాగ్యలక్ష్మి పథకంతో ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు, తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి ఇంటికి రూ.5 లక్షలతో కూడిన జీవిత బీమా అందనున్నట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గాన్ని అలజడులు సృష్టించేందుకు ప్రత్యర్ధి పార్టీల వారు ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధిక సంఖ్యలో భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. కోలాటాలతో మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీములను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనిఅన్నారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలను కోరారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, మాజీ ఎంపీపీ బి.శ్రీనివాస్యాదవ్, కొత్తపేట సర్పంచ్, ఉపసర్పంచ్ బచ్చు జానకీరాము లు, తండు రాములు గౌడ్, బంటు మహేందర్, నాయకులు శ్రీరామోజు వెంకన్నచారి, ఆర్.సైదులుగౌడ్, పి.సైదులు, డి.సునీత, డి.సుధాకర్, వి.యాదగిరి,జె.యాదగిరి, పాల్గొన్నారు.