నకిరేకల్, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతటా వ్యాపించేలా ఉండాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని, తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గస్థాయి ప్లీనరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బడుగుల లింగయ్య యాదవ్ ,షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతుకుముందు నకిరేకల్ ఇందిరాగాంధీ మెయిన్ సెంటర్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో బైకు ర్యాలీగా ప్లీనరీ వద్దకు చేరుకున్నారు. అనంతరం అమరవీరుల స్తూపానికి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతవాసులు వేరే రాష్ర్టాలకు వలస వెళ్లేవారు. రాష్ట్రం వచ్చిన తరువాత బయటి రాష్ర్టాల కూలీలు ఇక్కడికి వలస వస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మంత్రి కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన తీర్మాణాలను సభలో ప్రతినిధుల సమక్షంలోనే చప్పట్లతో ఆమోదం తెలిపారు.
ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ దయాకర్రెడ్డి, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ ఛైర్మన్లు రాచకొండ శ్రీనివాస్గౌడ్, కోమటిరెడ్డి చిన్న వెంకట్రెడ్డి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీ నగేశ్గౌడ్, తరాల బలరాం యాదవ్, బొప్పని స్వర్ణలత, నకిరేకల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, పట్టణాధ్యక్షులు యల్లపురెడ్డి సైదిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల సోమన్న, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, చల్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
చిరుమర్తిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేను చేసేందుకు నాతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలన్నారు. అలా హైదరాబాద్కు వెళ్లి కేటీఆర్, కేసీఆర్లతో నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల నిధులు తీసుకోస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధిలో పెద్దలతో పాటు తాను కూడా పాలుపంచుకుంటానన్నారు.
–ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో చర్చించిన అంశంపై ప్రతి గ్రామంలో చర్చ పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రతి ఒక్కరికీ తెలుపాలి. ఇవాళ సోషల్ మీడియా సాక్షిగా కొందరు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలి. నిజాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. బీఆర్ఎస్ వెంటే 70 శాతం మంది ప్రజలు ఉన్నారు..మన గెలుపు తథ్యం.
మూడోసారి చిరుమర్తిని శాసనసభకు పంపించాలి
మూడోసారి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను శాసనసభకు పంపించాలని ఆకాంక్షించారు. రంగు లు మార్చే పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అని, ఆ పార్టీలను చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు.
– షీప్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్