నకిరేకల్, డిసెంబర్ 5 : రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్లోని ప్రగతిభవన్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు.
నకిరేకల్లోని కాలంవారికుంట సుందరీకరణకు రూ.4.64 కోట్లు, కడపర్తి డబుల్ రోడ్డు విస్తరణకు రూ.2.94 కోట్లు, సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.కోటి కేటాయించాలని కోరినట్లు చెప్పారు. అదేవిధంగా చిట్యాల మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.కోటి కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి వారంలోగా నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మీడియాకు వెల్లడించారు. మున్సిపాలిటీల అభివృద్ధితోపాటు, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని మంత్రి అన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.