నల్లగొండ : ప్రజలందరికి అందుబాటులో ఉండేవిధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాజ్ వెజ్ మార్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలో రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ..మహిళా సోదరిమనులకు ఇబ్బంది కలగకుండా పరిశుభ్రంగా ఉండేవిధంగా కూరగాయలు, మాంసం మార్కెట్ను ఒకే వేదికపై నిర్మిస్తామన్నారు. 6 నెలల్లో మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు.సీఎం కేసీఆర్, మంత్రులు, కేటీఆర్, జగదీష్ రెడ్డిల సహకారంతో నకిరేకలన్ను అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.