కట్టంగూర్, జూన్ 1 : రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పామనుగుండ్ల గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు బీమనబోయిన యాదయ్య, కోటి లింగం, శ్రీను, నర్సింహతో పాటు 50మంది సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి ఆధ్వర్యంలో నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో గురువారం చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. దుర్మార్గమైన బీజేపీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుండాల శ్రీను, ప్రధాన కార్యదర్శి కనుకుల భాస్కర్రెడ్డి, వార్డు సభ్యులు ఆవుల రాములు, శ్రీను పాల్గొన్నారు.