నకిరేకల్, నవంబర్ 23: బీఆర్ఎస్తోనే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యలు అన్నారు. మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన సర్పంచ్ అబ్బగోని విజయలక్ష్మీశ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు సైదులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ దోరెపల్లి యాదగిరితో పాటు 50 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు మండల రవీందర్, దోరెపల్లి నర్సయ్య, గౌడ సంఘం మాజీ చైర్మన్ మాద రాములు, మాజీ వార్డు సభ్యులు దేశగోని వెంకన్న, అక్కినపల్లి వెంకటయ్య, చిట్టిపాక సైదులు, యూత్ నాయకుడు కట్ల సిద్ధు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, నాయకులు చెట్లపల్లి అంజయ్య, చిట్టిపాక శ్రీనివాస్, బాషపాక సతీశ్ , కొండకింది సోమిరెడ్డి పాల్గొన్నారు.అలాగే చందుపట్ల గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
వీరికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోనె సురేందర్, నరేందర్, వద్ది సత్యనారాయణ, టంగుటూరి సాయిలు, వనం యాదయ్య, వద్ది వెంకటేశ్వర్లు, పోలగోని నవీన్, గంగుల మల్లయ్యలు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇమ్మడపాక లక్ష్మీవెంకన్న, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్,