చిట్యాల, నవంబర్ 28 : డ్రైనేజీ నిర్మాణంతో చిట్యాలలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. సోమవారం పట్టణంలో టీయూఎఫ్ఐడీఎస్ రూ. 2.31 కోట్లతో జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాన న్నారు. డ్రైనేజీ నిర్మాణంతో పట్టణంలో ఏళ్ల నాటి మురుగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.
ఇప్పటికే పట్టణంలో రూ. 20 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఇంటిగ్రేటెడ్ పార్కును సంక్రాంతి వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చిల్డ్రన్ పార్కు, వైకుంఠధామాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిని చూడలేక బీజేపీ నాయకులు వ్యతిరేక చర్యలకు పాల్పడతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్ సహకారంతో చిట్యాలను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ లింగస్వామి, కమిషనర్ రాందుర్గారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆదిమల్లయ్య, డీఈఈ మనోహర్, నాయకులు మెండె సైదులు, వీ.వెంకటేశ్వర్లు, సైదులు, లక్ష్మయ్య, చంద్రకాంత్, సత్తయ్య, కృష్ణ,మౌనికాశేఖర్, పద్మ, బొందయ్య, జయమ్మ, శ్రీనివాస్రెడ్డి, పూలమ్మ, మల్లయ్య, లింగస్వామి, షుకూర్, యాదయ్య, రాజిరెడ్డి, సత్యనారాయణ, బొర్రారెడ్డి, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు.