నల్లగొండ: జిల్లాలోని చిట్యాల పట్టణ కేంద్రంలో మంగళవారం 5వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 2,3,9,10,12 వార్డుల్లో 50 లక్షల పైచిలుకు వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు, అనంతరం మున్సిపాలిటీతో పాటు మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువ గల సీఎం సహయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.