నల్లగొండ : నల్లగొండ పట్టణంలో శుక్రవారం(రేపు) జరగనున్న గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణాచారి, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి వల్లభరావు చెరువు, దండంపల్లి కెనాల్ వద్ద గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు గల ఏర్పాట్లను పరిశీలించారు.
వల్లభరావు చెరువు నాచు తొలగించాలని దండంపల్లి కెనాల్ వద్ద నీటి ప్రవాహం ఉన్నందున పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మండపాల నిర్వాహకులు శోభా యాత్రను క్రమపద్ధతిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.