దేవరకొండ, అక్టోబర్ 22 : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ ప్రజలను కోరారు. పట్టణంలో ఆదివారం ఆయన సమక్షంలో చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన 40మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం కావాలని ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే లేరని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఉండాలని పలువురు కోరుతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
పార్టీలో చేరిన వారు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య, జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేశ్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, నాయకులు యాసాని రాజవర్దన్రెడ్డి, రమావత్ మోహన్కృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, రాజు, లక్ష్మీపతి, మున్నయ్య, పవన్ పాల్గొన్నారు.