మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలు స్తున్నాయని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన రూ. 4లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వంలో ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉదారంగా వ్యవహరిస్తూ అనారోగ్యంతో ఆర్థి కంగా నష్టపోయిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించి ఆదుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సం క్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆసరా ఇస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు కుర్ర చైతన్య, జావీద్, నాయ కులు యడవెల్లి శ్రీనివస్రెడ్డి, పూనాటి లక్ష్మీనారాయణ, తిరుమలగిరి వజ్రం, గోవిందరెడ్డి, మజీద్ పాల్గొన్నారు.