సూర్యాపేట, జనవరి 4 (నమస్తేతెలంగాణ) : సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు ఓ దినపత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన కథనంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు కట్టించడం జరిగిందన్నారు.
తాను జిల్లా మంత్రిగా ఉన్నప్పటికీ హుజూర్నగర్ శాసన సభ్యుడిని కావడంతో అక్కడ తనకు క్యాంపు కార్యాలయం ఉందన్నారు. కాగా, తాను సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో అన్ని హంగులు ఉన్నాయని, మంత్రి క్యాంపు కార్యాలయానికి అనువుగా ఉంటుందని, అది తనకు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు పత్రికలో కథనం వచ్చిందన్నారు. అందులో వాస్తవం లేదని, తాను ఎలాంటి లేఖ రాయలేదన్నారు. ఇలాంటి
వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.