హుజూర్నగర్, డిసెంబర్ 31 : హుజూర్నగర్కు ఈ నెల 6న ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలు వెల్లడించారు. పట్టణ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద రూ.30కోట్లతో చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులకు శంకుస్థాపన, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఈఎస్ఐ ఆస్పత్రి, ఎస్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం రూ.20కోట్లతో ఆరున్నర కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న కీతవారిగూడెం -తాళ్లమల్కాపురం బీటీ రోడ్డు, హుజూర్నగర్లో రూ.6కోట్లతో నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
మున్సిపాలిటీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్లో పాల్గొని సమీకృత మార్కెట్ పనులు పరిశీలించి మగ్దుంనగర్, మాధవరాయినిగూడెంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం హుజూర్నగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్, మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు కేఎల్ఎన్రెడ్డి, ఉపేందర్, విజయ్, ప్రదీప్, మీసాల కిరణ్, రాంబాబు పాల్గొన్నారు.