చిట్యాల, నవంబర్ 13 : బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం చిట్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో ఈ కార్యక్రమం సాగనుంది. చిట్యాలలోని పాల కేంద్రం వద్ద మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీ ద్వారా కనకదుర్గ సెంటర్కు వస్తారు. అక్కడ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. రోడ్ షో విజయవంతానికి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి సుమారు 30వేల మంది ముఖ్య కార్యకర్తలు వచ్చేలా సన్నద్ధం చేస్తున్నారు. రోడ్ షోలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, చెరుకు సుధాకర్ పాల్గొననున్నారు.