ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
సూర్యాపేట, జూలై 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మొక్కలు నాటి కేకులు కట్ చేశారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేదలకు బెడ్ షీట్లు అందజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలోని తన ఫాంహౌజ్లో, ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి మిర్యాలగూడలో మొక్కలు నాటారు.
కోదాడ సాయిబాబా దేవాలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పండ్లు పంపిణీ చేశారు. సూర్యాపేటలో డీసీఎంఎస్ చైర్మన్ ఒట్టె జానయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మొక్కలు నాటారు. నాగార్జునసాగర్ హిల్కాలనీలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
గుర్రంపోడులో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ మదర్సాలో మొక్క నాటుతున్న మైనార్టీ నాయకులు
నల్లగొండ ఎస్ఎల్బీసీలోని గురుకుల పాఠశాలలో మొక్క నాటుతున్న విద్యార్థినులు