ఉమ్మడి జిల్లా అభివృద్ధి రథసారధిగా కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కేటీఆర్తోపాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మంత్రి జగదీశ్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో మొక్కను నాటి హరిత స్ఫూర్తిని చాటారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై18(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల మొక్కలు నాటడం, రక్తదానం, అన్నదానం, ఇతర సామాజిక కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్కుమార్, చిరుమర్తి లింగయ్య, పలు కార్పొరేషన్ల చైర్మన్లు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సీఎం కేసీఆర్ను మంత్రి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జగదీశ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపార ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్తోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఆర్ఐలు సైతం పలువురు తమ గ్రీటింగ్స్ తెలియజేశారు. ఉమ్మడి జిల్లా అంతటా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరిగాయి. నల్లగొండ, సూర్యాపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి స్వయంగా పాల్గొని కేట్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి సందడి చేశారు. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు మంత్రిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ తనపై అభిమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడినంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
నల్లగొండ, జూలై 18 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని 27వ వార్డు నుంచి భారీ సంఖ్యలో ముస్లిం మైనార్టీ యువకులు బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు ఎన్జీ కళాశాల నుంచి లక్ష్మి గార్డెన్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన మైనార్టీ యువత నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మైనార్టీ యువనేత మొబిన్ను ఆహ్వానించిన మంత్రి మైనార్టీ యువతకు బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.