తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ప్రొఫెసర్ మార్గదర్శకాలు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం మొదలైన తొలి ఉద్యమంలోనూ ఆయన పాత్ర అజరామరంగా నిలుస్తుందని కొనియాడారు. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన చిత్రపటం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జయశంకర్ సార్ అని, అటువంటి మహనీయులు కన్న కలలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు జయశంకర్ సార్ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు.
– సూర్యాపేట టౌన్, ఆగస్టు 6
జిల్లా వ్యాప్తంగా జయశంకర్సార్ జయంతి
రామగిరి, ఆగస్టు 6: జయశంకర్సార్ 89వ జయంతి వేడుకలను నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ సమీపంలో ఉన్న పంచతత్వ పార్క్ వద్ద ఉన్న జయశంకర్సార్ విగ్రహానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ది కీలక భూమిక. ఉద్యమకాలం, ఆ తర్వాత కూడా ఆయన చూపిన మార్గంలోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుంకరి మల్లేశ్గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్యదర్శి జనార్దన్రావు, కౌన్సిలర్లు పున్నగణేశ్, వట్టిపల్లి శ్రీనివాస్, బోయపల్లి శ్రీనివాస్, జెర్రెపోతుల అశ్వినీభాస్కర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అలకుంట్ల నాగరత్నంరాజు, తిప్పర్తి ఎంపీపీ ఏనుగు వెంకట్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, కంచర్ల విజయ, జమాల్ఖాద్రి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. నాగార్జున పాల్గొన్నారు.
ఎంజీయూలో వీసీ ప్రొఫెసర్ సీహెచ్. గోపాల్రెడ్డి, జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెకర్లు హేమంత్ కేశవ్పాటిల్, జి. శ్రీనివాస్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.అపూర్వరావు జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సార్ చూపిన బాటలో పయనిద్దాం : జడ్పీ చైర్మన్
జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జయశంకర్సార్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారధ్యంలో ముందుకు సాగుదామన్నారు.
ఉద్యమానికి దిక్సూచి జయశంకర్ సార్
సూర్యాపేట టౌన్, ఆగస్టు 6 : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమ సమయంలో దివంగత ఆచార్య జయశంకర్ సార్ దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఆచార్య జయశంకర్ సార్ మార్గదర్శకాలు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం మొదలైన తొలి ఉద్యమంలో ఆయన పాత్ర అజరామరంగా నిలిచిందన్నారు. దివంగత ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని, ఆయన ఆలోచనా విధానం మేరకే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. అలాంటి ఎందరో మహనీయుల కలలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించిన తెలంగాణలో గత తొమ్మిదేండ్లుగా సాకారమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించుకుని నేడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.