నిడమనూరు, అక్టోబర్ 22 : మండలంలోని బొక్కమంతల పహాడ్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు మహాన్నదానం చేశారు. కార్యక్రమంలో అమిరెడ్డి వెంకట్రెడ్డి, వేణుధర్రెడ్డి, మురళీధర్రెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ అర్పెనబోయిన వెంకన్న, మాజీ ఎంపీటీసీ జిల్లేపల్లి బాలకోటి, చింతకుంట్ల మల్లారెడ్డి, శ్రీనివాస్, శంకర్, శివ, అనిల్ పాల్గొన్నారు.
చిట్యాల : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్యాలలో అమ్మవారి శోభాయాత్రను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. అందంగా ముస్తాబు చేసిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పట్టణంలోని జాతీయ రహదారిపై శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సంతోష్నగర్లో నేతాజీ యువజనం సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల వద్ద గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి దంపతులు అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, శీలా సత్యనారాణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండె సైదులు, పొన్నం లక్ష్మయ్య, వనమా వెంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, జిట్ట చంద్రకాంత్, దాసరి నర్సింహ, కోనేటి కృష్ణ, పందిరి గీత, జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, గోధుమగడ్డ జలంధర్రెడ్డి, చిత్రగంటి ప్రవీణ్ పాల్గొన్నారు.
దామరచర్ల : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మండల కేంద్రంలోని కనకదుర్గ ఆలయంలో ఆదివారం చండీహోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అర్చనలు, శతనామ పూజలను అర్చకులు పవన్కుమారాచార్యులు, నిఖిలాచార్యుల ఆధ్వర్యంలో చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కందుల నాగిరెడ్డి, వెంకటరెడ్డి, పడిగెపాటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
రామగిరి : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చింది. తులసీనగర్ సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారిని మహాగౌరిగా, మహాలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి దేవీగా అలంకరించారు. రాక్హిల్స్కాలనీ రోడ్డు నంబర్5లో అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీటీకాలనీ శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కట్టంగూర్ : మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఆలయ ఆవరణలో అమ్మవారి విగ్రహం వద్ద ఆదివారం నవకన్య పూజ నిర్వహించారు. పదేండ్లలోపు బాలికలను అమ్మవారిగా భావించి పూజలు చేశారు. కార్యక్రమంలో పూజారి శ్రీరామడుగు శ్రీనివాసశర్మ, పంచాంగ కర్త రామడుగు అశ్విన్ కార్తీక్ శర్మ, రోహిత్ శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు జిలేంద్ర శర్మ, కోమటి భాస్కర్, చెరుకు వెంకన్న, మీలా వేణు, కాపుగంటి నరేశ్, వీరేశ్, కొల్లూరు శివ,
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ.. “ఏ వరం కావాలో కోరుకో!” అన్నాడు. దానికి మహిషుడు.. “నాకు ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేకుండా వరం ఇవ్వు స్వామీ!” అని కోరుకున్నాడు. బ్రహ్మ “తథాస్తు!” అనడంతో.. మహిషుడికి ఎక్కడలేని అహంకారం పెరిగిపోయింది. ఈ వరం కోరుకోవడం వెనుక మహిషాసురుడి ఉద్దేశం.. ఆడవాళ్లు తనను ఏమీ చేయలేరనే అహంకారమే! కానీ, ఆ అహమే తనను అంతం చేస్తుందని అతడు తెలుసుకోలేకపోయాడు. వరం పొందిన మహిషుడు దేవతలను, ప్రజలను హింసించేవాడు. దాంతో వారంతా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు.
అప్పుడు బ్రహ్మ – విష్ణు – మహేశ్వరులు.. “మేము మహిషుణ్ని అంతం చేయలేము. అది బ్రహ్మ ఇచ్చిన వరం! కానీ, ఒక మహిళ చేతిలోనే మహిషుడు అంతమవుతాడు!” అని చెప్పారు. దాంతో ఇంద్రాది దేవతలంతా కలిసి త్రిమూర్తుల సహాయంతో.. 18 చేతులు కలిగిన ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సమర్పించారు. అలా దేవతలంతా తమతమ ఆయుధాలను ఆ శక్తికి సమర్పించారు. అలా 18 చేతుల్లో మారణాయుధాలను ధరించిన ఆ శక్తే.. దుర్గామాతగా అవతరించింది. ఈ ఆయుధాలకు తోడు అత్యంత శక్తిగల వాహనం సింహాన్ని కూడా సమర్పించారు.
అలా సకల ఆయుధాలతో మహిషాసురుడితో యుద్ధం ప్రారంభించింది దుర్గాదేవి. ఆ యుద్ధం తొమ్మిది రోజులు సాగింది. చివరికి అమ్మవారు పదో రోజున మహిషుణ్ని సంహరించింది. యుద్ధం చేసిన ఆ తొమ్మిది రోజులే దేవీ నవరాత్రులుగా మారాయి. మహిషుణ్ని సంహరించినందున, దుర్గామాత విజయానికి గుర్తుగా.. పదోరోజు విజయదశమిగా మారింది. దశమి రోజున విజయం సిద్ధించింది కాబట్టి.. ప్రజలంతా ఈ రోజును విజయదశమిగా జరుపుకొంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే.. దసరా పండుగ.