తల్లిదండ్రులను గౌరవించాలి.. సేవా దృక్పథం అలవర్చుకోవాలి
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సదర్శాపురంలో వర్రె రాఘవులు విగ్రహావిష్కరణ
విలువలతోనే మనిషికి సమాజంలో గుర్తింపు లభిస్తుందని,వాటిని కాపాడుకోవడానికి సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం మోత్కూరు మండలం సదర్శాపురంలో సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు వర్రె రాఘవులు ప్రథమ వర్ధంతికి మంత్రితోపాటు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్రె రాఘవులు విగ్రహాన్నిఆవిష్కరించి మంత్రి మాట్లాడారు. తల్లిదండ్రులను అనాథ అశ్రమాల్లో పెట్టడం క్షమించరాని నేరమని, ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు.
మోత్కూరు, మే 17 : వర్రె రాఘవులు ఉపాధ్యాయుడిగా సమాజం కోసం పనిచేస్తూనే కుటుంబాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దారని, ఆయన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు రాఘవులు ప్రథమ వర్ధంతి సంస్మరణ సభను మండలంలోని సదర్శాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గుండా చంద్రయ్యతో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి రాఘవులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో మనం ఉన్నామంటే తల్లిదండ్రులే కారణమన్నారు.
తల్లిదండ్రులను అనాథ అశ్రమాల్లో పెట్టడం క్షమించరాని నేరమన్నారు. ప్రేమను మాటల్లో గాక సేవ, మనస్సులో పెట్టాలన్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రుల యోగ క్షేమాలను చివరి వరకు చూసుకోవాలన్నారు. కుటుంబం అన్ని రంగాల్లోనూ రాణించాలంటే విద్యతోనే సాధ్యమని, అందువల్ల ప్రతిఒక్కరూ చదువుకోవాలని సూచించారు. మానవ హక్కుల కమిషన్ చాలా అద్భుతంగా పని చేస్తున్నదన్నారు. గ్రామ, పట్టణాల్లో సమస్యలను ప్రజలు తమ కమిషన్ దృష్టికి తేవాలని కోరారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ చదువుతోనే కుటుంబం అన్ని రంగాల్లోనూ రాణిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్, సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మాజీ మంత్రి కృష్ణయాదవ్, సినీ ఆర్టిస్టు నరేశ్, భువనగిరి ఆర్డీఓ ఎంవీ.భూపాల్రెడ్డి, విగ్రహ శిల్పి దేవికారాణి, అద్దంకి దయాకర్, ఎంపీపీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, జడ్పీటీసీలు గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సర్పంచ్ వర్రె కవితాశ్రీనివాస్, మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్, వర్రె రాఘవులు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.