సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న దేశ ప్రజలు
సీఎం కేసీఆర్ అంటే ఆంధ్రోళ్లకు గిట్టదని కొందరు అబద్ధపు ప్రచారాలు చేశారు. కానీ వాటిని తలకిందులు చేస్తూ మొదటగా బీఆర్ఎస్లోకి చేరిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే. కేసీఆర్ వంటి నాయకత్వం తమకుంటే బాగుండు అని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో రూ.2వేల పింఛన్, 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే గుజరాత్లో మాత్రం రూ.600 పింఛన్, 6 గంటల కరెంట్ను మోటర్లకు మీటర్లు పెట్టి ఇస్తున్నారు. దేశంలోనే ఒక్క నిమిషం కూడా కరెంట్ పోని రాష్ట్రం ఒక్క తెలంగాణలో మాత్రమే. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల మంత్రులు, ఢిల్లీ అధికారులు మెచ్చుకుంటుంటే ప్రధాని మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని చీకట్లోకి నెట్టాలని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు చూస్తున్నారు.
– మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎనిమిదేండ్లలోనే అనేక పథకాల అమలుతో వ్యవసాయం పండుగలా మారి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారంలో రూ.11.25 కోట్లతో నిర్మించిన 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల ఎమ్మెల్యే కిశోర్కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం అడ్డగూడూరు, మోత్కూరు మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రా కంటే తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పిన ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలతో అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, వడ్లు కొంటానని మోసం చేశారని మండిపడ్డారు.
అడ్డగూడూరు, జనవరి 8 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎని మిదేండ్లలోనే అనేక పథకాల అమలుతో వ్యవసాయం పండుగలా మారి ప్రపంచానికి అన్నంపెట్టే స్థాయికి మన రైతులు ఎదిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని చౌళ్లరామారం గ్రామంలో ఆదివారం అడ్డగూడూరు, మోత్కూరు మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు చౌళ్లరామారం గ్రామ శివారులో రూ.11.25 కోట్లతో నిర్మించిన 15 వేల మెట్రిక్ టన్నుల గోదామ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ సీనియర్ నాయకుడు అని పేర్కొన్నారు.
బీజేపీ అండతో మోదీ ప్రధానమంత్రి అయ్యారని సీఎం కేసీఆర్లాగా ఉద్యమాలు చేసి కాలేదని విమర్శించారు. దేశంలో ఉన్న వనరులను వేగంగా ప్రజలకు మేలు చేయడానికే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటైందని అన్నారు. దొడ్డు వడ్లను కొంటానని చెప్పి కొనకుండా రైతులను ప్రధాని మోదీ ముప్పుతిప్పలు పెడితే సీఎం కేసీఆర్ నా రైతులను కాపాడుకుంటానని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు. వానకాలంలో ఆంధ్రాలో సాగు చేసిన వరి 38 లక్షల ఎకరాలు కాగా తెలంగాణలో వరి 68 లక్షల ఎకరాలని అన్నారు. 2014లో మోదీ ప్రధానమంత్రి అయ్యే ముందు 2022 వచ్చే వరకు రైతుల ఆదాయం రెండితలు చేస్తానని చెప్పి రైతులను అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని అంటున్నారని వారికి మేం స్వాగతం చెబుతున్నామని కానీ ఆంధ్ర వాళ్లతో కృష్ణానది నీళ్ల వివాదం నెల రోజుల్లో పరిష్కారం కావాల్సిన సమస్యను 8 యేండ్లుగా తేల్చని మీరు ఏముఖం పెట్టుకొని తెలంగాణ పోటీ చేస్తారని విమర్శించారు. 2014 ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మహబూబ్నగర్కు వచ్చి ఇది వెనుకబడి న జిల్లా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిస్తామని చెప్పి కట్టకుండా ప్రాజెక్ట్పై 190 కేసులు పరోక్షంంగా వేసింది వాళ్లేనని విమర్శించారు.
గోదావరి జలాలతో సస్యశ్యామలం ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
బస్వాపురం ప్రాజెక్ట్ గుండా బునాదిగాని కాల్వ ద్వారా గోదావరి జలాలతో అడ్డగూడూరు, మోత్కూ రు మండలాలు సస్యశ్యామలం కానున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. త్వరలో రూ.680 కోట్లతో మండలం గుండా జాతీయ రహదారి రానున్నదని పనులు కూడ జరుగుతున్నాయని అన్నారు. అలాగే మండలంలోని కంచనపల్లిలో నిర్మించిన ఇమ్మడి సోమర్సయ్య నూతనంగా నిర్మించిన ఆర్బీఓ ప్లాంట్ను మంత్రు లు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రారంభించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచందు, ఎండీ జితేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, అడ్డగూడూరు, మోత్కూరు, జడ్పీటీసీలు శ్రీరాముల జ్యోతీఅయోధ్య, గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, అడ్డగూడూరు, మోత్కూరు సింగిల్ విండో చైర్మన్లు పొన్నాల వెంకటేశ్వర్లు, కంచర్ల అశోక్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, రైతు బంధు సమితి మండ ల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, నాయకులు సంకేపల్లి రఘునందన్రెడ్డి, పొన్నబోయిన రమేశ్, శ్రీరాముల అయోధ్య, గిడ్డంగుల ఎస్ఈ కృష్ణమూర్తి, డీఈ రాజు, డీఏఓ అనురాధ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మోదీవి అన్నీ దొంగ మాటలే : మంత్రి జగదీశ్రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే మాటలు అన్ని దొంగ మాటలే అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పెట్టగానే శత్రువులకు అప్పుడే భయం పుట్టుకుందని అన్నారు. అందుకే మనపై ఈడీ, సీబీఐలతో దాడి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పెట్టగానే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు వచ్చి చేరారని అన్నారు. సీఎం కేసీఆర్ అంటే ఆంధ్రోళ్లకు గిట్టదని కొందరు అనుకుంటున్నారని కానీ వాళ్ల ఆలోచనలను తలకిందులు చేస్తూ మొదటగా వాళ్లే వచ్చి చేరారని అన్నారు. సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారన్నారు. ఆంధ్ర ప్రజలు కేసీఆర్ వంటి నాయకత్వం మాకుంటే బాగుండు అని అనుకు ంటున్నారని అన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 3 ఎకరాల భూమి వస్తుందని అన్నా రు.
తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతుందని ఆంధ్రప్రదేశ్ వెనుకకు పోతుందని ఆంధ్ర ప్రజలే చెబుతున్నారని అన్నారు. దేశంలోనే ఒక్క నిమిషం కూడ కరెంట్ పోని రాష్ట్రం ఒక్క తెలంగాణలో మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల మంత్రులు, ఢిల్లీ అధికారులు మెచ్చుకుంటుంటుంటే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ చూస్తే కడుపు మండుతుందని ఎద్దేవా చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రంగా మారిందని అన్నారు. మాంసం,చేపల ఉత్పత్తి కూడ తెలంగాణలో ముందుందని వివరించారు. 25 లక్షల మంది ఇతర రాష్ర్టాల వలస కార్మికుల సీఎం కేసీఆర్ ఉపాధి కల్పించారు. కంఠం మీద కత్తి పెట్టిన తెలంగాణ రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ అని అన్నారు.