గిరిజన జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ సేవాలాల్గా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కిశోర్కుమార్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో వారి సంక్షేమానికి సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని.. ప్రజా ప్రతినిధులుగా, నాయకులుగా ఎదిగేందుకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. బీటీ రోడ్లు,సీసీ రోడ్లు, ఇంటింటికీ భగీరథ నీళ్లు, 24 గంటల కరెంట్ తండాల దశను మార్చిందని చెప్పారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తుంగతుర్తి నియోజక వర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టి రక్తాన్ని పారించిన పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
నూతనకల్, మార్చి 13 : దేశంలో గిరిజన, బంజారాలకు గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి వేడుకల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే గాదకి కిశోర్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3500 తండాలను పంచాయతీలుగా మార్చిన సీఎం కేసీఆర్ అభినవ సేవాలాల్గా గుర్తింపు పొందారన్నారు. ఎంతో ధైర్యం, తెగువ ఉన్న గిరిజన జాతి అడవికి పరిమితమై తండాల్లోనే జీవనం సాగిస్తూ వచ్చారన్నారు. గత పాలకులు వారి గురించి పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గిరిజనులను సర్పంచులుగా, నాయకులుగా ఎదిగేలా తోడ్పాటు అందించినట్లు తెలిపారు. 24 గంటల ఉచిత కరెంట్తో పాటు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, తండాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. అంతకు ముందు సంత్ సేవాలాల్ మహారాజ్ కు మంత్రి, ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.
సేవాలాల్ చూపిన మార్గంలో నడువాలి : ఎమ్మెల్యే కిశోర్
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ గిరిజన జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అన్నారు. సేవాలాల్ ఆశయాలకు అనుగుణంగా ఆయన మార్గంలో పయనించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని 122 తండాలకు బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో అందరూ ఐక్యంగా ఉండి తండాలను మరింతగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, రైతు బంధు సమితి జిల్లా అధక్షుడు రజాక్, ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, తాసీల్దార్ జమీరొద్దీన్, ఎంపీడీఓ ఇందిర, ఏపీఎం కర్ణాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలుగౌడ్ , సర్పంచ్ తీగల కరుణశ్రీ, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, నాయకులు శంకర్నాయక్, సురేందర్నాయక్, నర్సింగ్నాయక్, సజ్జన్నాయక్, రవినాయక్, దీప్లానాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజనులు పాల్గొన్నారు.