అమరులకు చేయూతలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేటలోని స్మృతివనంలో సంతోష్బాబు విగ్రహావిష్కరణ
భారత్-చైనా సరిహద్దులో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన మహావీర చక్ర దివంగత కర్నల్ సంతోష్బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సంతోష్బాబు ద్వితీయ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట కాసరబాద రోడ్డులోని స్మృతి వనంలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని
మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తాలో గల సంతోష్బాబు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సేవలో అమరులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని, సీఎం కేసీఆర్ ఆర్థిక చేయూతనిచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.
సూర్యాపేట, జూన్ 15(నమస్తేతెలంగాణ) : దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివంగత సంతోష్బాబు ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాసరబాద రోడ్డులోని స్మృతివనంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్బాబు విగ్రహాన్ని కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కర్నల్ సంతోష్బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైందన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో కర్నల్ సంతోష్బాబు చనిపోతే ఆయన భౌతికకాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హకీంపేట నుంచి సూర్యాపేట వరకు తీసుకొస్తున్నప్పుడు దారి పొడవునా ప్రజలు నీరాజనం పలికిన తీరు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశానికి అద్దం పడుతుందన్నారు. అటువంటి త్యాగానికి ఏమిచ్చినా సరిపోదని, దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి వెంట తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు ఉంటారని తెలియజేప్పేందుకు సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.
కర్నల్ సంతోష్బాబు ప్రాణత్యాగం మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రశంసించారు. అనంతరం పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సంతోష్బాబు విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కల్నల్ సంతోష్బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, తల్లి మంజుల, కుటుంబ సభ్యులతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ఉప్పల ఆనంద్, బైరు వెంకన్న, బత్తుల రమేశ్, పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం, వాసవీక్లబ్ సభ్యులు పాల్గొన్నారు.